عن ابن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «مَنْ قَرَأ حَرْفاً مِنْ كِتاب الله فَلَهُ حَسَنَة، والحَسَنَة بِعَشْرِ أمْثَالِها، لا أقول: ألم حَرفٌ، ولكِنْ: ألِفٌ حَرْفٌ، ولاَمٌ حَرْفٌ، ومِيمٌ حَرْفٌ».
[صحيح] - [رواه الترمذي]
المزيــد ...
ఇబ్నె మసూద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం భోదించారు- అల్లాహ్ పవిత్ర గ్రంధం నుండి ఎవరైతే ఒక అక్షరం పఠిస్తారో అతనికి దానిపై ఒక పుణ్యం లభిస్తుంది,ఆ పుణ్యం పదివంతులకు పెరుగుతుంది,మరి నేను ‘అలీఫ్ లామ్ మీమ్’ కలిపి ఒక అక్షరం అని చెప్పడం లేదు,కానీ "c2">“అలీఫ్ ఒక అక్షరం’ లామ్ ఒక అక్షరం” మీమ్ ఒక అక్షరం”.
దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు
ఈ హదీసులో ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు : నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు: పవిత్రఖురాన్ గ్రంధ పఠనం చదివే ప్రతీ ముస్లిముకు అతను చదివే ప్రతీ అక్షరం పై పది పుణ్యాలు ప్రసాదించబడతాయి,దైవప్రవక్త చెప్పిన : "لا أقول الم حرف" ‘నేను అలీఫ్ లామ్ మీమ్’ను ఒక అక్షరముగా చెప్పడం లేదు”అనగా నేను ఆ మూడు అక్షరాలను కలిపి ఒక అక్షరం అని చెప్పడం లేదు’కానీ అలీఫ్ ఒక అక్షరము,లామ్ ఒక అక్షరము మరియు మీమ్’ఒక అక్షరముగా చెప్తున్నాను,అప్పుడు పాఠకుడికి దీనిపై ముప్పై పుణ్యాలు లభిస్తాయి,ఇది ఒక గొప్ప వరము మరియు మహాపుణ్యము,కాబట్టి ప్రతీ ముస్లిముకు వీలైనంత అధికంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రసాదమైన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని చేయాలి.