عن عائشة - رضي الله عنها-، أن أمَّ سَلَمَة، ذَكَرَت لرسول الله صلى الله عليه وسلم كَنِيسة رأتْهَا بأرض الحَبَشَةِ يُقال لها مَارِيَة، فذَكَرت له ما رأَت فيها من الصُّور، فقال رسول الله صلى الله عليه وسلم : «أولئِكِ قوم إذا مات فيهم العَبد الصالح، أو الرُّجل الصَّالح، بَنُوا على قَبره مسجدا، وصَوَّرُوا فيه تلك الصِّور، أولئِكِ شِرَار الخَلْق عند الله».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
ఆయెషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ‘ఉమ్మే సల్మా రజియల్లాహు అన్హా మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో హబ్షా లో ఆమే చూసిన చర్చి గురించి అందులోని చిత్రాల/బొమ్మల గురించి ప్రస్తావించారు,ఆమెను 'మారియా 'అని పిలుస్తారు,అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు తెలుపుతూ’ వారిలోని పుణ్యాత్ములు లేక దైవదాసులు చనిపోయినప్పుడు వారి సమాధులపైనా ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు ,అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు'అని తెలిపారు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
‘ఆయేషా (రదీయల్లాహు అన్హా) తెలియజేస్తున్నారు :ఉమ్ము సల్మా(రదీయల్లాహు అన్హా) ఇథియోపియాలో ఉన్నప్పుడు,అక్కడ ఒక చర్చిని చూసారు,అది వివిధ చిత్రాలతో చిత్రీకరించబడింది.ఆమె చూసిన అందమైన పటాలు మరియు చిత్రాల అందం గురించి ఆశ్చర్యంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కి చెప్పారు.ఈ సమస్య యొక్క తీవ్రత మరియు తౌహీద్ ఏకత్వానికి వాటిల్లే ముప్పు కారణంగా,ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనతల పైకెత్తి, వారికి అలాంటి చిత్రాలు ఉనికి లోకి రావడానికి గల కారణాలను వివరించారు. వాటికి వ్యతిరేకంగా తన సమాజాన్ని హెచ్చరిస్తూ, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీరు ప్రస్తావించిన ఈ చిత్రపటాలు వారిలో కొంతమంది పుణ్యపురుషులు,దైవదాసులు చనిపోయిననప్పుడు,వారిసమాధిపై ఒక్కో ఆలయాన్ని నిర్మించారు,అక్కడ వారు ప్రార్ధనలను దైవిక సేవలను నిర్వహించారు,ఈ ఆలయాన్ని ఇలాంటి చిత్రాలతో చిత్రించారు.పిదప దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ చిత్రాలను సృష్టించిన వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు అత్యంత హీనమైన సృష్టితాలు అని వివరించారు, ఎందుకంటే అలాంటి వృత్తి బహుదైవారాధనకు షిర్కు కు దారితీస్తుంది.