عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَتَبَاهَى النَّاسُ فِي الْمَسَاجِدِ».
[صحيح] - [رواه أبو داود والنسائي وابن ماجه] - [سنن أبي داود: 449]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ప్రజలు మస్జిదుల గురించి పోటీ పడి గొప్పలు చెప్పుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు.”
[ప్రామాణికమైన హదీథు] - [అబూ దావూద్, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 449]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరుత్థాన దినం చేరువకావడం మరియు ప్రపంచము ఒక ముగింపుకు రావడం యొక్క సంకేతాలలో - ప్రజలు తమ మస్జిదుల అలంకరణ గురించి గొప్పలు చెప్పుకోవడం లేదా కేవలం అల్లాహ్’ను స్మరించుట కొరకు మాత్రమే నిర్మించిన మస్జుదుల లోపల వారి ప్రాపంచిక వ్యవహారాల గురించి గొప్పలు చెప్పుకోవడం ఒకటి.