عن عبادة بن الصامت رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم "مَنْ شهِد أنْ لا إله إلا الله وحده لا شرِيك له وأنَّ محمَّدا عبده ورسُولُه، وأنَّ عِيسى عبدُ الله ورسُولُه وكَلِمَتُه أَلقَاها إِلى مريم ورُوُحٌ مِنه، والجنَّة حَقٌّ والنَّار حقٌّ، أَدْخَلَه الله الجنَّة على ما كان مِنَ العمَل".
[صحيح] - [متفق عليه]
المزيــد ...
ఉబాదహ్ బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం;మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు"అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యవము లేడు ఆయన ఏకైకుడు అతనికి ఎవరు సాటి లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమిస్తూ,మర్యం పుత్రుడైన ఈసాను అల్లాహ్ దాసుడుగా మరియు సందేశహరుడుగా,మర్యం వైపుకు పంపబడ్డ దైవవాక్యం గా,అల్లాహ్ తరుపున ఊదబడిన ఆత్మగా విశ్వసించి,స్వర్గ నరకాలు సత్యం అని భావించి ఎవరైతే సాక్ష్యామిస్తారో అల్లాహ్ సు త ఆ వ్యక్తి కార్యాలు ఎలా ఉన్నా అతన్ని స్వర్గం లోకి పంపిస్తాడు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
ఈ హదీసు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే : తౌహీద్ వచనాన్ని పఠించి దాని అర్ధాన్ని గ్రహించి,ఆ వచనం ప్రకారంగా అమలు చేస్తూ,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారిని దైవదాసుడు మరియు దైవప్రవక్తగా విశ్వసించాలి,ఈసా అలైహిస్సలాం కూడా ఒక దైవదాసుడు మరియు దైవప్రవక్త మరియు అయిపో’అనే ఆదేశం ద్వారా మర్యంకు పుట్టించబడ్డాడు అని నమ్మాలి,ఆయన తల్లికి శత్రువులైన యూదులు ఆపాదించిన అబద్దపు విషయాలను అసత్యంగా ఖండించాలి,స్వర్గం అల్లాహ్ ను విశ్వసించిన ప్రజలకొరకు,నరకాగ్ని కాఫీరుల కొరకని విశ్వసించాలి,ఈ విశ్వాసం పై మరణించిన వారి కార్యక్రమాలు ఎలా ఉన్న వారు చివరికి స్వర్గం లో ప్రవేశిస్తారు.