عن عبد الله بن مسعود رضي الله عنه مرفوعاً: "إن من شرار الناس من تُدركهم الساعة وهم أحياء، والذين يتخذون القبور مساجد".
[حسن] - [رواه أحمد]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన, "c2">“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.”
ప్రామాణికమైనది - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత నీచులు, దుష్టులను గురించి ఇలా తెలియజేస్తున్నారు: వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది; మరియు ఎవరైతే సమాధులను మస్జిదులుగా చేసుకున్నారో, అంటే వారు సమాధుల వద్ద తమ నమాజులను ఆచరిస్తారు, మరియు వాటి వైపునకు తిరిగి నమాజులను ఆచరిస్తారు.