عن عائِشَة رضي الله عنها مرفوعاً: «لا صلاة بِحَضرَة طَعَام، وَلا وهو يُدَافِعُه الأَخبَثَان».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...
ఆయెషా రజియల్లాహు అన్హా మర్ఫు ఉల్లేఖనం“భోజనం సిద్దంగా ఉన్నప్పుడూ నమాజు లేదు మరియు మలమూత్రాలు కలిగినప్పుడు (అవసరం ఉన్నప్పుడూ) వాటిని పూర్తి చేసుకోనంత వరకు నమాజు అవ్వదు
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
ఈ హదీస్ ద్వారా తాకీదుపరుస్తున్న విషయం ‘-దాసుడు తన ప్రభువు ఎదుట నమాజు కొరకు మనసును సంపూర్ణంగా లగ్నపరుస్తూ చిత్తశుద్దితో నిలబడాలని కోరడం జరుగుతుంది,ఇది జరగాలంటే మనిషి చిత్తశుద్దిని,శాంతిని భంగ పరిచే కారకాలను,(కార్యాలను) దూరం చేసుకోవాలి,అంచేత మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోజనం సిద్దంగా ఉన్నప్పుడూ నమాజు చదవకూడదని వారించారు ఎందుకంటే దానివల్ల నమాజుచేసే వ్యక్తి మనస్సు భోజనం వైపు లాగబడుతుంది,అతని హృదయం అటువైపు మరలుతూ ఉంటుంది,ఇదే విధంగా తీవ్ర మలమూత్ర అవసరమున్నప్పుడు కూడా నమాజు చదవకూడదని చెప్పడం జరిగింది,ఎందుకంటే మనిషి దాని ఒత్తిడి వల్ల మనసును నమాజుపై కేంద్రీకరించలేడు.