عن ابن عباس رضي الله عنهما : أن رسول الله صلى الله عليه وسلم لما بعث معاذا إلى اليمن قال له: "إنك تأتي قوما من أهل الكتاب، فليكن أولَ ما تدعوهم إليه شهادة أن لا إله إلا الله" -وفي رواية: "إلى أن يوحدوا الله-، فإن هم أطاعوك لذلك فأعلمهم أن الله افترض عليهم خمس صلوات في كل يوم وليلة، فإن هم أطاعوك لذلك فأعلمهم أن الله افترض عليهم صدقة تؤخذ من أغنيائهم فَتُرَدُّ على فقرائهم، فإن هم أطاعوك لذلك فإياك وكَرَائِمَ أموالِهم، واتق دعوة المظلوم فإنه ليس بينها وبين الله حجاب".
[صحيح] - [متفق عليه]
المزيــد ...
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం ‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ పంపించినప్పుడు భోదించారు ‘నిశ్చయంగా నీవు గ్రంధవహకుల జాతి వద్దకు వెళ్తున్నావు కాబట్టి మొట్ట మొదట వారిని ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘సాక్ష్యం వైపునకు ఆహ్వానించు,మరో రివాయత్ లో అల్లాహ్ తౌహీద్ వైపునకు అని ఉంది ‘ఒకవేళ వారు ఈ విషయం లో నీకు విధేయత చూపితే ,రోజుకు(రాత్రింపగళ్ళు) ఐదు పూటల నమాజులు వారిపై అల్లాహ్ సు త విధి చేశాడన్న విషయము తెలియపర్చు,ఒకవేళ వారు ఈ విషయం లో ను నీకు విధేయత చూపితే,అల్లాహ్ (సు త) వారిపై జకాతు ను విధి చేశాడన్న విషయం తెలియజేయి అది ధనికుల నుండి సేకరించి బీదల్లో పంచబడుతుంది,ఇందులో కూడా వారు నీకు విధేయత కనబరిస్తే వారి హలాల్ ధనం నుండి దూరంగా ఉండు ,పీడితుని దుఆ నుండి రక్షింపబడు,ఎందుకంటే అల్లాహ్ మరియు పీడితునికి మధ్యలో ఎటువంటి తెర ఉండదు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు చెందిన ఒక ప్రాంతానికి దాయి మరియు గురువుగా చేసి పంపారు పంపేటప్పుడు ఆయనకు ‘దావత్ ఇలల్లాహ్’కార్యం పట్ల కొన్ని ప్రణాళికలు సూచించారు : ప్రవక్త అతనికి ఉపదేశించారు- యూదులు మరియు క్రైస్తవులకు చెందిన చదువుకొన్న మరియు వాదించే జాతి వైపుకు వెళ్తున్నావు"-తద్వారా వారితో సత్యం వాదించడానికి,వారి అపోహలను దూరం చేయడానికి పరిపూర్ణంగా ఆయన సిద్దం కావచ్చు,ఆ పై ఆయనకు ఉపదేశించారు-దావత్ ను ముఖ్యమైన అంశం నుండి ప్రారంభించాలని తరువాత దిగువ స్థాయికి చెందిన ప్రముఖ అంశాలను చెప్పాలి,కాబట్టి ప్రజలకు మొట్టమొదట అఖీదా తౌహీద్ ను సంస్కరించుకోమని చెప్పాలి,ఎందుకంటే ఇది పునాది అంశం,ఈ విషయాన్ని కనుక వారు విశ్వసించినట్లైతే ఆపై వారికి నమాజు స్థాపించమని ఆదేశించాలి,ఎందుకంటే తౌహీద్ తరువాత విధి కార్యాల్లో ఇది ప్రముఖమైనది,నమాజు సక్రమంగా ఆచరిస్తున్నప్పుడ వారిలోని ధనికుల ‘సంపద నుండి జకాత్ తీసి బీదవారికి చెల్లించమని ఆదేశించాలి,తద్వారా వారి మనసుకు సంతోషం కలిగి అల్లాహ్ యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటారు,ఆపై ముఆజ్ బిన్ జబల్ కు జకాత్ కొరకు విలువైన వస్తువులను తీసుకోకూడదు అని వారించారు ఎందుకంటే మధ్యరకం సొమ్ముని చెల్లించడం విధి కాబట్టి,పిదప మహనీయ దైవప్రవక్త న్యాయంగా వ్యవహరించాలని దౌర్జన్యానికి పాల్పడకూడదు అని ఉపదేశించారు ఎందుకంటే ఎవరైనా పీడితుడు అతనిపట్ల అల్లహ్కు దుఆ చేస్తే ఆ పీడితుని దుఆ ఖచ్చితంగా స్వీకరించబడుతుంది.