إِنَّ أُمَّ حَبِيبَةَ بِنْتَ جَحْشٍ الَّتِي كَانَتْ تَحْتَ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ شَكَتْ إِلَى رَسُولِ اللهِ صلى الله عليه وسلم الدَّمَ، فَقَالَ لَهَا: «امْكُثِي قَدْرَ مَا كَانَتْ تَحْبِسُكِ حَيْضَتُكِ، ثُمَّ اغْتَسِلِي». فَكَانَتْ تَغْتَسِلُ عِنْدَ كُلِّ صَلَاةٍ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 334]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ ఔఫ్ రజియల్లాహు అన్హు భార్య అయిన ఉమ్మె హబీబహ్ బింత్ జహ్ష్ రజియల్లాహు అన్హా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సమస్యతో వచ్చి (బహిష్ఠు స్థితిలో వచ్చే) రక్తాన్ని గురించి ప్రశ్నించింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”. అయితే ఆమె ప్రతి సలాహ్ (నమాజు)కు ముందు స్నానం చేసేవారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 334]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరులలో ఒక మహిళ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి (బహిష్ఠు స్థితికి సంబంధించి) నిరంతరం రక్తస్రావం అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ కొత్త పరిస్థితి ఎదురు కాకముందు, బహిష్ఠు స్థితి, ఆమెను సలాహ్ (నమాజు) ఆచరించకుండా ఎంతకాలం ఆపి ఉంచేదో, అంత కాలం వేచి ఉండి తరువాత గుసుల్ చేసి నమాజు ఆచరించమని ఆదేశించినారు. అయితే ఆమె స్వచ్ఛందంగా ప్రతి సలాహ్ కు ముందు స్నానం చేసేవారు.