عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«نَضَّرَ اللَّهُ امْرَأً سَمِعَ مِنَّا شَيْئًا فَبَلَّغَهُ كَمَا سَمِعَ، فَرُبَّ مُبَلِّغٍ أَوْعَى مِنْ سَامِعٍ».
[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 2657]
المزيــد ...
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకగా తాను విన్నానని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు.
[దృఢమైనది] - - [سنن الترمذي - 2657]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేశారు: 'ఎవరైతే నా మాటలు విని, వాటిని గట్టిగా గుర్తుంచుకుని ఇతరులకు చేరవేస్తాడో, అల్లాహ్ అతనికి ఇహలోకంలో తేజస్సు, ఆనందం మరియు అందాన్ని ప్రసాదించుగాక! మరియు పరలోకంలో స్వర్గం యొక్క తేజస్సు, సుఖాలు మరియు ప్రకాశాన్ని అనుగ్రహించుగాక!' ఎందుకంటే, సందేశాన్ని అందుకున్న వ్యక్తి (శిష్యుడు), దాన్ని తెలియజేసిన వ్యక్తి (గురువు) కంటే ఎక్కువ గ్రహించే శక్తి, వివేకం మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. ఇదే విధంగా, మొదటి వ్యక్తి (గురువు) సరిగ్గా గుర్తుంచుకుని అందించడంలో నిష్ణాతుడైతే, రెండవ వ్యక్తి (శిష్యుడు) ఆలోచించి తార్కికంగా అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు కావచ్చు."