عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «أَثقَل الصَّلاةِ على المُنَافِقِين: صَلاَة العِشَاء، وصَلاَة الفَجر، وَلَو يَعلَمُون مَا فِيها لَأَتَوهُمَا وَلَو حَبْوُا، وَلَقَد هَمَمتُ أًن آمُرَ بِالصَّلاَةِ فَتُقَام، ثُمَّ آمُر رجلاً فيصلي بالنَّاس، ثُمَّ أَنطَلِق مَعِي بِرِجَال معهُم حُزَمٌ مِن حَطَب إلى قَومٍ لاَ يَشهَدُون الصَّلاَة، فَأُحَرِّقَ عَلَيهِم بُيُوتَهُم بالنَّار».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
అబూహురైర రజియల్లాహు అన్హు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తూ తెలిపారు ‘(మునాఫీఖీన్) కపటుల పై భారమైన నమాజులు ‘ఇషా మరియు ఫజర్ నమాజు ,ఒకవేళ వారికి అందులో ఉన్న ప్రాముఖ్యత తెలిసి ఉంటే ఖచ్చితంగా మోకాళ్లపై ప్రాకుతూ (నడుస్తూ)వస్తారు,నేను ఇలా భావించాను:ప్రజలకు నమాజు చదవమని చెప్పి ఒక వ్యక్తి కి నమాజు చదివించు అని ఆదేశించి,కొంత మందిని మరియు కట్టెల ప్రోగును వెంట తీసుకుని నమాజు కు రాని వారి వద్దకి వెళ్ళి వారి ఇళ్ళు తగలపెట్టాలి.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
కపటులు ప్రజలకు చూపించడానికి అమలు చేసేవారు,అల్లాహ్ స్మరణ చాలా తక్కువగా చేసేవారు,అల్లాహ్ ఈ విషయాన్ని తెలియజేశాడు,ఫజర్ మరియు ఇషా నమాజులలో వారి రంగు పూర్తిగా బహిర్గతమయ్యేది,ఎందుకంటే ఈ నమాజులు పూర్తిగా చీకటి సమయాల్లో జరిగేవి,ఈ కపటులు ఆ చీకటి వల్ల ఇతరుల కళ్ళకు చిక్కకుండా తప్పించుకునేవారు,అందువల్ల చాలా మంది కపటులను ఇటువంటి తియ్యని కమ్మని నిద్ర వేళల్లో జరిగే నమాజులకు గైరహాజరు కావడం మేము చూసేవారము,వాస్తవానికి ఈ నమాజులకు ఎవరిలో నైతే ఈమాన్ బిల్లాహ్ దృఢస్థాయిలో ఉండి పరలోకచింతతో పుణ్యఫలాపేక్ష ఆసక్తి ఉన్నవారిని మాత్రమే నమాజుకు ఉత్సాహంగా హాజరుపరిచేవి,ప్రస్తావించిన ప్రకారంగా చూసినట్లైతే ఈ నమాజులు మునాఫికీనులపై అతి భారమైనవి మరియు క్లిష్టమైనవిగా తెలుస్తున్నాయి,కానీ ఒకవేళ వారికి జమాత్ తో పాటుగా నమాజు ఆచరించడం వల్ల లభించే పుణ్యఫలం ఏమిటో తెలిస్తే వారు ఖచ్చితంగా నమాజులో పాల్గుంటారు, పసివాడు తన చేతుల మరియు కాళ్ళ సహాయంతో ఏవిధంగా ప్రాకుతాడో అలా(అంగవైఖల్యంతో)మోకాళ్లపై ప్రాకవలసి వచ్చినా సరే వారు వస్తారు!దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రమాణం చేస్తూ చెప్పారు: ప్రవక్త సంకల్పించుకున్నారు ఈ రెండు నమాజుల పట్ల సోమరితనాన్ని చూపిస్తు హాజరు కానివారికి తీవ్రమైన శిక్ష వేయాలని,అప్పుడు ప్రజలను నమాజుకు ఆదేశించి నమాజు జమాత్ సిద్దమయ్యాక తన స్థానంలో ఒక వ్యక్తిని నమాజుకు నియమించి కొంత మందిని జమపరిచి వారిని కట్టెలమూటలతో సహావెంట పెట్టుకుని జమాత్ తో హాజరు కాని వారి వద్దకి వెళ్ళి వారి ఇళ్లల్లోనే వారిని కాల్చేయాలి ఎందుకంటే వారు జమాత్ తో పాటు నమాజు ఆచరించ కుండా ఒక మహాపాతకానికి ఒడిగట్టుతున్నారు,ఒక వేళ ఇళ్ళల్లో ఏ పాపమెరుగని పిల్లలు మహిళలు కనుక లేకపోతే ఖచ్చితంగా ఇలా చేసి ఉండేవారని,దీనికి చెందిన ఇతర హదీసుల ద్వారా తెలుస్తుంది.