عن عائشة رضي الله عنها قالت: «كان النبي صلى الله عليه وسلم يذكر الله على كل أحْيَانِه».
[صحيح] - [رواه مسلم والبخاري معلقا.
للفائدة: التعليق حذف الإسناد]
المزيــد ...
ఆయెషా రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తూ తెలిపారు:మహనీయ దైవప్రవక్త సల్లాలల్హు అలైహివ సల్లమ్ ఎల్లప్పుడూ అల్లాహ్ ని స్మరిస్తూ జపిస్తూ ఉండేవారు.
దృఢమైనది - దాన్ని బుఖారీ ముఅల్లఖన్ బసీగతిల్ జజ్మి ఉల్లేఖించారు
హాదీసు అర్ధం:("كان النبي صلى الله عليه وسلم يذكر الله") "c2">“మహనీయ దైవప్రవక్త సల్లాలల్హు అలైహివ సల్లమ్ ఎల్లవేళలో అల్లాహ్ ని స్మరిస్తూ జపిస్తూ ఉండేవారు”అనగా ప్రతీ రకమైన దైవస్మరణ తస్బీహ్,తహ్లీల్,తక్బీర్,మరియు తహ్మీద్’చేస్తూ ఉండేవారు,మరియు స్మరణలోనే ఖురాన్ పారాయణం కూడా చేసేవారు,ఎందుకంటే ‘ఖురాన్ కూడా అల్లాహ్ స్మరణలోనిదే కాకుండా అత్యుత్తమమైన దైవస్మరణ కూడా!("على كل أحْيَانِه")తమ ఎల్లవేళలో”అర్ధం :మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు తమ పూర్తి సమయాల్లో అల్లాహ్ ను స్మరించేవారు,మరియు ఒకవేళ ఆయనకు పెద్దతహరత్ లేక చిన్నతహరత్ భంగం ఏర్పడిన సరే,కానీ ధార్మిక వేత్తలు మాత్రం జనాబత్ సందర్భంలో చేసే స్మరణ నుండి పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని తొలగించారు,జనాబత్ అశుద్ధత కలిగిన వ్యక్తి చూస్తూ కానీ,గుర్తున్నది కానీ ఎట్టి పరుస్థితుల్లో ఖుర్ఆన్ పారాయణం చేయడానికి వీల్లేదు,అలీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం :మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ జునుబ్ అశుద్ధవస్తలో మాకు పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని చదివించేవారు కాదు”(అహ్మద్ ,సునన్ అర్బా) స్త్రీ రుతుస్రావంలో లేదా ప్రసవానంతర రక్తస్రావం సమయంలో ఖుర్ఆన్ పారాయణం గురించి ఆమెకూడా జునుబ్ అశుద్దవస్త ఆదేశంలోకి వస్తుందా లేదా?విషయంలో ధార్మిక పండితులు భిన్నభిప్రాయాలను కలిగి ఉన్నారు,ఇందులో స్పష్టమైన ఆదేశం ‘కంఠస్థరూపంలో ఖురాన్పారాయణం చేయడంలో ఎలాంటి సమస్యలేదు ఎందుకంటే ఇవి రెండు స్థితులు దీర్ఘంవ్యవధిని కలిగి ఉంటాయి మరియు అశుద్దవస్థవ్యక్తి చేతుల ఆదేశం మాదిరి వీరి చేతుల ఆదేశం ఉండదు,ఎల్లవేళలా ఖుర్ఆన్ పటించడంలో ఈ విషయాలు దాఖలు అవ్వవు: మలమూత్ర విసర్జనల స్థితి,సంభోగంజరిపినస్థితి,మరియు ఖురాన్ గొప్పతనానికి భంగం కలిగించే ప్రదేశాలలోఉదా : స్నానాల గదులు,మరుగుశాలలు మొదలైన ఇతరాత్ర అశుద్ధ ప్రదేశాలు.