«يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللهِ، فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2702]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరైన అల్ అగర్రి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను."
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడాలని మరియు తరుచుగా ఆయన క్షమాపణను కోరుకోవాలని ఆజ్ఞాపించారు. తన గత మరియు భవిష్యత్ పొరపాట్లు క్షమించబడినప్పటికీ, తాను ప్రతిరోజు వందకు పైగా అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడుతున్నానని మరియు ఆయన క్షమాపణను కోరుతున్నానని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనకు తానుగా తెలియజేస్తున్నారు. ఇది అల్లాహ్ కు పరిపూర్ణ విధేయత మరియు దాస్యాన్ని సూచిస్తుంది.