عَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«نَحْنُ آخِرُ الأُمَمِ، وَأَوَّلُ مَنْ يُحَاسَبُ، يُقَالُ: أَيْنَ الأُمَّةُ الأُمِّيَّةُ وَنَبِيُّهَا؟ فَنَحْنُ الآخِرُونَ الأَوَّلُونَ».
[صحيح] - [رواه ابن ماجه] - [سنن ابن ماجه: 4290]
المزيــد ...
ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము, ఇలా అనబడుతుంది: నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ? కావున మేము చివరివారము మరియు మొదటివారము.
[ప్రామాణికమైన హదీథు] - [ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:] - [సునన్ ఇబ్న్ మాజహ్ - 4290]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, వారి సమాజము కాలపరంగా చివరి సమాజము మరియు ప్రళయదినాన మొట్టమొదట లెక్క తీసుకోబడే సమాజము కూడా అదే. ప్రళయదినాన ఇలా పిలవబడుతుంది: 'నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ ఉన్నారు?'. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు కావడాన్ని బట్టి ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. కాబట్టి మనము మొదట లెక్క కోసం పిలవబడతాము. మనము ఈ ప్రపంచంలో చిట్టచివరి వాళ్ళము, కానీ తీర్పు రోజున లెక్కలో మరియు స్వర్గంలో ప్రవేశించడంలో మొదటివాళ్ళం.