عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضيَ اللهُ عنهما:
سَأَلَ رَجُلٌ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ عَلَى المِنْبَرِ، مَا تَرَى فِي صَلاَةِ اللَّيْلِ، قَالَ: «مَثْنَى مَثْنَى، فَإِذَا خَشِيَ الصُّبْحَ صَلَّى وَاحِدَةً، فَأَوْتَرَتْ لَهُ مَا صَلَّى» وَإِنَّهُ كَانَ يَقُولُ: «اجْعَلُوا آخِرَ صَلاَتِكُمْ وِتْرًا» فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَمَرَ بِهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 472]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబరుపై ఉండగా ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు ’రాత్రి (తహజ్జుద్ )నమాజు ఎలా చేయాలి అనే విషయంపై మీ మార్గదర్శకం ఏమిటి? అని అడిగాడు, రెండు రెండుగా చేసి చేయి, తెల్లవారుతుందన్న భయం వేసినప్పుడు (తహజ్జుద్ సమయం ముగిస్తున్నప్పుడు) ‘ఒక రకాత్ చదువు’ అది చదివిన రకాతులను బేసిగా మార్చేస్తుంది.’ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఎల్లప్పుడు ప్రవచిస్తూ ఉండేవారు ’మీ రాత్రి యొక్క చివరి నమాజును వితర్ (బేసి) నమాజుగా మార్చుకోండి’ నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరగా దీనిని (వితర్ ను) ఆచరించమని ఆదేశించారు.
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 472]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ (Minbar)పై ఉపన్యాసం ఇస్తుండగా ఒక వ్యక్తి ఆయనను అడిగాడు: 'ఓ రసూలుల్లాహ్! నేను రాత్రి నమాజ్ (ఖియాముల్ లైల్) ఎలా చేయాలో నాకు నేర్పండి? అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ప్రతి రెండు రకాతుల తరువాత సలాం చేయాలి, తెల్లవారుతుందన్న భయం కలిగితే ఒక రకాత్ చదువు, అది నీవు చదివిన నమాజులను బేసి సంఖ్యగా మార్చేస్తుంది, మరియు నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి యొక్క చివరి నమాజును వితర్ గా చేయమని ఉపదేశించేవారు.