عن عبد الله بن عُمر وأبي هريرة رضي الله عنهما أنهما سمعا رسول الله صلى الله عليه وسلم، يقول على أعواد منبره:
«لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 865]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) తాము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి ఇలా అనగా విన్నాము అని ఉల్లేఖిస్తున్నారు:
“ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 865]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి శుక్రవారం ప్రార్థనను నిర్లక్ష్యం చేయరాదని, సరియైన కారణం లేకుండా సోమరితనం లేదా అజాగ్రత్త కారణంగా శుక్రవారం నమాజును తప్పిపోకూడదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు ‘సత్యాన్ని అనుసరించకుండా నిరోధించే ఒక అడ్డంకితో అల్లాహ్ వారి హృదయాలను కప్పివేసి, వాటిని సీలు చేస్తాడు. ఫలితంగా, వారు మంచితనం యొక్క మార్గాలను పట్టించుకోని, లక్ష్యములేని వారిలో ఒకరిగా మిగిలిపోతారు. వారి ఆత్మలు విధేయత ఆచరణల నుండి తప్పుకుంటాయి.